విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా "దర్జా" ట్రైలర్ రిలీజ్

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా "దర్జా" ట్రైలర్ రిలీజ్

సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ ఆవిష్కరించారు. ట్రైలర్ చాలా బాగుంది. చాలా రిచ్‌గా చిత్రీకరించారు. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు కామినేని శ్రీనివాస్, నిర్మాత పైడిపాటి శివశంకర్,  కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటితో పాటుచిత్ర దర్శకుడు సలీం మాలిక్, సంగీత దర్శకులు రాప్రాక్ షకీల్, కెమెరామెన్ దర్శన్, అక్ష ఖాన్ స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ పురుషోత్తపు బాబీ, రైటర్ భవానీ ప్రసాద్, హీరోషమ్ము, మరో  హీరో   అరుణ్ వర్మ (సత్తి పండు)ఆర్టిస్ట్ సమీర్, కో డైరెక్టర్ రాజా తదితరులు పాల్గొన్నారు.

సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి..
కెమెరా: దర్శన్,
సంగీతం: రాప్ రాక్ షకీల్,
ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ,
కథ: నజీర్,
మాటలు: పి. రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనర్ : బందర్ బాబీ,
స్ర్కిఫ్ట్ కో-ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ,
పీఆర్ఓ: బి. వీరబాబు,
కో & ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రవి పైడిపాటి,
నిర్మాత: శివశంకర్ పైడిపాటి,
స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సలీమ్ మాలిక్.