తలసానికి, గంగులకు గుట్కా ఎక్కడ దొరికిందో చెప్పాలి

తలసానికి, గంగులకు గుట్కా ఎక్కడ దొరికిందో చెప్పాలి

తెలంగాణలో బ్యాన్ చేసిన గుట్కా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, గంగుల కమలాకర్ కు ఎక్కడి నుంచి దొరికిందో చెప్పాలని డిమాండ్ చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. నిషేదిత గుట్కాను..ఇద్దరు మంత్రులు దొంగల్లా తింటున్నారని అన్నారు. క్రేన్, వక్కపోడో అయితే దాచుకొని తినాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. అది కూడా ప్రగతి భవన్ లో కేబినెట్ మీటింగ్ జరుగుతుండగానే తిన్నారన్నారు. “ఇలాంటి సన్నాసులను సీఎం కేసీఆర్.. మా మీద మంత్రులుగా రుద్దిండు. ఇలాంటి వారితో బంగారు తెలంగాణ సాధ్యమా” అని దాసోజు ప్రశ్నించారు. అంతేకాదు..ఈ మంత్రులపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని అన్నారు దాసోజు.

“తెలంగాణాలో పొగాకు గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా, మరి ఈమంత్రులకు యెట్లా దొరికింది? ఎవరు స్మగుల్ చేస్తుండ్రు? ఎట్లా సప్లై చేస్తుండ్రు? బందు బెట్టిన గుట్కాను, బాజాప్తాగా తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాల్నా లేదా?” అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు దాసోజు శ్రవణ్.