- వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో ఘటన
వికారాబాద్, వెలుగు: తల్లిదండ్రులు విడాకులకు అప్లయ్ చేశారని తెలుసుకున్న కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం వికారాబాద్ జిల్లా ధారూర్ మండల పరిధిలో గురువారం జరిగింది. మండలంలోని నాగ సముందర్ గ్రామానికి చెందిన శిరీష (17) తల్లిదండ్రులు గొడవల కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. భార్యాభర్తలు ఇటీవల విడాకులకు అప్లయ్ చేశారు. తల్లి దగ్గరే ఉంటున్న శిరీష.. మనస్తాపంతో గురువారం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ శిరీష శుక్రవారం రాత్రి మరణించింది. తండ్రి రాములు ఇచ్చిన కంప్లయింట్తో కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సురేశ్ తెలిపారు.