
కేరళలోని కొల్లం జిల్లాలో ఓ కోడలు అత్తను రాయితో కొట్టి చంపింది. అత్త పలుమార్లు కోడలుని అక్రమసంబంధముందని నిందలు వేయడంతో ఆమె ఈ పని చేసింది. డిసెంబర్ 11న జరిగిన ఈ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేమణి మధ్యాహ్నం నిద్రలో ఉన్నప్పుడు గిరిత ఈ నేరానికి పాల్పడింది. బట్టలు ఉతకడానికి ఉపయోగించే పెద్ద రాయిని బ్యాగ్ లోపల ఉంచి బ్యాగుతో రేమణి తలపై కొట్టింది. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో గిరిత, రేమణి తప్ప మరెవరూ లేకపోవడంతో గిరిత ఈ దారుణానికి ఒడిగట్టింది.
కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కండక్టర్గా పనిచేస్తున్న రేమణి కుమారుడు బిమాల్ కుమార్ను గిరితా వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు పిల్లలతో కలిసి కొల్లాం జిల్లా శివార్లలోని పుత్తూరులో నివాసముంటున్నారు. 2015లో బిమాల్కు వయనాడుకు ట్రాన్స్ఫర్ కావడంతో గిరితా భర్తతో పాటు వయనాడుకు వెళ్లింది. గిరితా వయనాడులో ఉన్నంతవరకూ ఎటువంటి గొడవలు జరగలేదు. తిరిగి వారు పుత్తూరుకు రావడంతో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. గిరితా మరియు రేమణిల మధ్య ఈ గొడవ 17 సంవత్సరాలుగా జరుగుతుంది. గిరితాకు మరోకరితో వివాహేతర సంబంధం ఉందని రేమణి అనడంతో వారిమధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. అందువల్ల వారు ఒకే ఇంట్లో ఉంటూ కూడా వేరువేరుగా వంట చేసుకునేవారు. గిరితకు అక్రమ సంబంధముందని రేమని గిరిత పిల్లల ముందు కూడా అనడంతో ఆగ్రహించిన గిరిత అత్త రమణిని రాయితో కొట్టి చంపిందని పుత్తూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రతీష్ కుమార్ తెలిపారు. డిసెంబరు 24, మంగళవారం సాక్ష్య సేకరణ కోసం పోలీసులు గిరితను క్రైమ్ స్పాట్కు తీసుకెళ్లినప్పుడు తాను ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు గిరితను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు గిరితను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
For More News..