న్యూఢిల్లీ: ఇండియా టెన్నిస్ డేవిస్ కప్ జట్టు కెప్టెన్ రోహిత్ రాజ్పాల్కు కీలక బాధ్యతలు అప్పగించారు. గ్లాస్గో వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్కు ఆయన ఇండియా బృందానికి ‘చెఫ్ డి మిషన్’గా నియమితులయ్యారు. డిప్యూటీ చెఫ్ డి మిషన్గా రవి బెంగానీ వ్యవహరించనుండగా.. జనరల్ టీమ్ మేనేజర్లుగా వందనా రావు, రాహుల్ స్వామి ప్లేయర్లతో కలిసి ప్రయాణించనున్నారు.
జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. ఐవోఏ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న రోహిత్ రాజ్పాల్.. ఏఐటీఏ వైస్ ప్రెసిడెంట్గానూ సేవలు అందిస్తున్నాడు. క్రీడా పరిపాలనతో పాటు అన్ని క్రీడా సమాఖ్యలతో రోహిత్కు ఉన్న మంచి సంబంధాలు ఉన్నాయి. పరిపాలనా అనుభవం కారణంగానే ఐవోఏ నాయకత్వం రోహిత్కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
