రోడ్డు పక్కన పదో తరగతి బాలిక డెడ్‌బాడీ

రోడ్డు పక్కన పదో తరగతి బాలిక డెడ్‌బాడీ

ఘట్‌కేసర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓ బాలిక అనుమానాస్పదంగా మృతిచెందింది. సర్వీస్ రోడ్డు పక్కన కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకొని పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతురాలిని పోలీసులు స్రవంతిగా గుర్తించారు. ఇటీవలే పదో తరగతి పాస్ అయిన స్రవంతి.. ఇంట్లో గొడవపెట్టుకొని అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్టు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. సూసైడ్ చేసుకుందా లేక ఎవరైనా చంపేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.