ప్రేమించిన వ్యక్తితో పెండ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని సూసైడ్
మాదాపూర్, వెలుగు: గురువారం దుర్గం చెరువులో దూకి సూసైడ్ చేసుకున్న యువతి డెడ్బాడీని డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. మాదాపూర్ ఇన్ స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా షాదిపూర్ గ్రామానికి చెందిన పాయల్(20) జాబ్ కోసం 3 నెలల కిందట సిటీకి వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.27లో ఫ్రెండ్ భాగ్యశ్రీతో కలిసి ఉంటోంది. పాయల్ జూబ్లీహిల్స్లోని ఓ ఇంట్లో హౌస్ మెయిడ్ అండ్ బేబీ కేర్ టేకర్గా పనిచేస్తోంది. గురువారం మధ్యాహ్నం భాగ్యశ్రీతో కలిసి కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వెళ్లింది. ఇద్దరూ అక్కడ ఫొటోలు దిగారు. ఆ తర్వాత పాయల్ ఒక్కసారిగా బ్రిడ్జి పైనుంచి దుర్గం చెరువులోకి దూకింది.
సమాచారం అందుకున్న లేక్ పోలీసులు, బల్దియా డీఆర్ఎఫ్ బృందాలు దుర్గం చెరువులో గాలింపు చర్యలు చేపట్టాయి. రాత్రయినా ఆచూకీ దొరక్కపోవడంతో శుక్రవారం ఉదయం మళ్లీ గాలించారు. మధ్యాహ్నం 12 గంటలకు పాయల్ డెడ్బాడీని గుర్తించి చెరువులో నుంచి బయటికి తీసుకొచ్చారు. డెడ్బాడీని ఉస్మానియాకు తరలించారు. ప్రేమించిన యువకుడితో పెండ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వల్లే పాయల్ మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి పండరీనాథ్ ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసి
దర్యాప్తు చేపట్టామన్నారు.