TSRTC ఖాళీ స్థలాల లీజుకు,, టెండరు దాఖలు గడువు మార్చి 15

TSRTC ఖాళీ స్థలాల లీజుకు,, టెండరు దాఖలు గడువు మార్చి 15

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) హైదరాబాద్, సికింద్రబాద్ లోని ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వడానికి ఇ-టెండర్లను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.. ఈక్రమంలో మరోసారి టెండర్ల దాఖలుకు ఆహ్వానించారు. ఆసక్తి గల వారు ఆన్ లైన్లో ఈ -టెండర్లను దాఖలు చేయడానికి చివరి తేది మార్చి15,2024 గా నిర్ణయించారు. 

హైదరాబాద్ , సికింద్రాబాద్ పరిధిలోని కాచిగూడ, మేడ్చల్, శామీర్ పేట్, హకీంపేట్ వంటి ప్రధాన ప్రదేశాల్లో భూములు అందుబాటులో ఉన్నందున అద్దెకు ఇచ్చేందుకు , ఆ భూముల్లో ఆటో మొబైల్ సర్వీస్ సెంటర్లు, షోరూమ్ లు, ఇన్ సిటి వేర్ హౌస్ లు, లాజిస్టిక్ లను ఏర్పాటు చేయాలనే నిబంధనలతో ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులను కోరుతోంది టీఎస్ ఆర్టీసీ. 

కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్ లో 2.83 ఎకరాలు, శామీర్ పేట్ 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.91 ఎకరాలు,రషీద్ గూడ1- 4.75 ఎకరాలు,రషీద్ గూడ 2- 6.03 ఎకరాలు, తుర్కయాంజల్ 1-5.74 ఎకరాలు, తుక్క యాంజల్2- 6.23 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వనున్నట్లు టీఎస్ ఆర్టీసి ప్రకటించింది.

టెండర్ ప్రక్రియ, దరఖాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఆసక్తి గల వారు ఉదయం 10.30 గంట లనుంచి సాయంత్రం 5 గంటల వరకు డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్ ని 9959224433లో సంప్రదించాలని సూచించింది.