హుజురాబాద్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

హుజురాబాద్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

హుజురాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనున్నక్రమంలో.. ఇవాళ్టి(శుక్రవారం) తో నామినేషన్ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి రోజున తమ నామినేషన్లు దాఖలు చేశారు. గెల్లు శ్రీనివాస్ (TRS), ఈటల రాజేందర్ (BJP), బల్మూరి వెంకట్ (కాంగ్రెస్) తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ పేపర్లను ఈ నెల 11న పరిశీలించనున్నారు. ఈ నెల 13వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఈ నెల 30న పోలింగ్.. నవంబరు 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.