మధ్యప్రదేశ్​లో బాలికపై గ్యాంగ్​ రేప్

మధ్యప్రదేశ్​లో బాలికపై గ్యాంగ్​ రేప్

భోపాల్: మాట్లాడలేని, వినలేని ఓ బాలికపై ఆరుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయి ఫొటోలు తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. గత శనివారం జరిగిన ఈ ఘటన బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్​లోని శహడోల్ ​ప్రాంతానికి చెందిన ఓ దివ్యాంగురాలైన బాలికకు ఓ బాలుడు మాయమాటలు చెప్పి ఎవరూ లేని చోటికు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ మరో అయిదుగురు ఉన్నారు. వారంతా కలిసి బాలికను పక్కనే ఉన్న ఓ గుడిసెలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఫోన్​లో అమ్మాయి ఫొటోలు తీశారు. ఈ ఫొటోలు స్థానికంగా వైరల్ ​కావడంతో బాలిక తల్లిదండ్రులకు విషయం తెలిసింది. గురువారం అమ్మాయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆరుగురిని అరెస్ట్​ చేశారు. కాగా నిందితుల్లో నలుగురు మైనర్లేనని అధికారులు చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

డబ్బుల కోసం సెల్ఫ్ కిడ్నాప్.. రంగంలోకి పోలీసులు

గాంధీజీ, లాల్‌బహదుర్ శాస్త్రికి ప్రధాని మోడీ నివాళి