Andhra Train Accident: విజయనగరం రైలు ప్రమాదంలో 8కి చేరిన మృతులు

Andhra Train Accident: విజయనగరం రైలు ప్రమాదంలో 8కి చేరిన మృతులు

విజయనగరం  జిల్లా  చినరావుల పల్లి వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతిచెందినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రమాదంలో 32 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు అంబులెన్స్ ల ద్వారా తరలించి చికిత్స అందిస్తున్నామని విజయనగరం కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు. 

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి(అక్టోబర్29) రెండు రైళ్లు ఢీకొన్నాయి. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ కోసం పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు.. ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. అధికారులు రంగంలోకి సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ప్రమాద స్థలంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఆ ప్రాంతం అంతా చీకటిగా మారింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఓవర్ హెడ్ కేబుల్ తెగడంతో విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు నిలిచిపోగా.. పలాస ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది.