టీకాలు తగ్గుతున్నయ్.. మరణాలు పెరుగుతున్నయ్

టీకాలు తగ్గుతున్నయ్.. మరణాలు పెరుగుతున్నయ్

న్యూఢిల్లీ: కరోనా పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ఒకవైపు వ్యాక్సిన్ నిల్వలు నిండుకుంటుంటే.. మరోవైపు కరోనా మరణాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 'టీకాలు అయిపోతున్నాయి, కొవిడ్ మరణాలు ఎక్కువవుతున్నాయి. కేంద్ర విధానం ఒకటే.. ప్రజల దృష్టిని మరల్చడం, అసత్యాలను వ్యాప్తి చేయడం, నిజాలను దాస్తూ గోల చేయడం' అని ట్వీట్ లో రాహుల్ మండిపడ్డారు.