న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కు మరోసారి బెదిరింపు లేఖ వచ్చింది. గంభీర్ ను, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామని ఐసిస్ కశ్మీర్ ఉగ్రవాదులు మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఈ టీమిండియా మాజీ ఓపెనర్ కు బెదిరింపు లేఖ రావడం ఇది మూడోసారి. నాల్రోజుల కింద ఆయనకు 2 లెటర్లు వచ్చాయి. ఢిల్లీ పోలీసులు, ఐపీఎస్ శ్వేత తమను ఏమీ చేయలేరని.. పోలీసుల్లో తమ గూఢచారులు ఉన్నారని తాజా మెయిల్ లో టెర్రరిస్టులు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కాగా, బెదిరింపు లేఖలపై ఇదివరకే ఢిల్లీ పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన ఇంటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
BJP MP Gautam Gambhir has allegedly received a third threat e-mail from 'ISIS Kashmir', Delhi Police also mentioned in the mail: Delhi Police
— ANI (@ANI) November 28, 2021