షార్జా: ఐపీఎల్-13లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. ప్రారంభంలోనే వికెట్ కోల్పోయిన చెన్నై టీమ్ ను వాట్సన్(36), డుప్లెసిస్ నిలబెట్టారు. ఈ క్రమంలోనే డుప్లెసిస్(58) హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ ధోనీ(3) మరోసారి నిరాశపరిచినా.. చివర్లో అంబటి రాయుడు(45), జడేజా(33) చెలరేగి ఆడటంతో ఛాలెంజింగ్ స్కోర్ చేసింది చెన్నై.
బౌలర్లలో నోర్ట్జే రెండు వికెట్లు తీయగా రబాడ, తుషార్ దేశ్పాండే చెరో వికెట్ పడగొట్టారు.
Innings Break!
An unbeaten 50-run partnership between @RayuduAmbati & @imjadeja at the back end of the innings, propels #CSK to a total of 179/4.
Live – https://t.co/LC2biyWd5Z #Dream11IPL pic.twitter.com/Eh2sGzp2j4
— IndianPremierLeague (@IPL) October 17, 2020