పంత్ పంచ్.. రాజస్థాన్ ఖేల్ ఖతం

పంత్ పంచ్.. రాజస్థాన్ ఖేల్ ఖతం

రాజస్థాన్ జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 116 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ  5 వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలోనే  చేధించింది. దీంతో ఈ సీజన్ లో ఢిల్లీ  14 మ్యాచ్ లు ఆడి 9 మ్యాచ్ లలో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరింది.

116 రన్స్ టార్గెట్ అయినా ఢిల్లీ స్టాటింగ్ లో తడబడింది. వరుసగా వికెట్లు పడడంతో స్కోరు  బోర్డు నెమ్మదించింది. ఓపెనర్లు పృథ్వి షా 8 రన్స్, ధావన్16 రన్స్ కే అవుట్ అయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 15 పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. తర్వాత వచ్చిన రిషబ్ పంత్ 38 బంతుల్లో53 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. రాజస్థాన్‌ బౌలర్లలో ఇష్‌ సోధి మూడు వికెట్లు తీయగా శ్రేయస్‌ గోపాల్‌ రెండు వికెట్లు తీశాడు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ తక్కువ స్కోర్ కే కుప్పకూలింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 రన్స్ మాత్రమే చేసింది. రాజస్థాన్ కు మంచి ప్రారంభం దక్కలేదు. ఇశాంత్ శర్మ వేసిన 2వ ఓవర్ లాస్ట్ బాల్ కి రహానే(2) ధవన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. ఆ తర్వాత మళ్లీ ఇశాంత్ వేసిన 4వ ఓవర్ ఐదో బాల్ కి లివింగ్‌స్టోన్(14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే అక్షర్ పటేల్ వేసిన ఓవర్‌లో సంజూ శాంసన్(5) రనౌట్ అయ్యాడు. ఇశాంత్ వేసిన ఆరో ఓవర్ ఫస్ట్ బాల్ కి ఫోర్ కొట్టిన లామ్‌రోర్(8) ఆ తర్వాతి బాల్ కి పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 4 వికెట్ల నష్టానికి 30 రన్స్ మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ ఒక్కడే ఆచితూచి ఆడుతూ(30) రన్స్ చేశాడు. రాజస్థాన్ ప్లేయర్లలో పరాగ్ ఒక్కడే ఎక్కువ స్కోర్(50 హాఫ్ సెంచరీ) చేయగలిగాడు. ఢిల్లీ బౌలర్లలో..ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా అద్భుతమైన బౌలింగ్ తో తలో మూడు వీకెట్లు తీయగా..ట్రెంట్ బోల్ట్ కు 2 వికెట్లు దక్కాయి. రాజస్థాన్ 14 మ్యాచ్ లు ఆడి ఐదు మ్యాచ్ లు గెలిచి, ఒకటి రిజల్ట్ రాకపోవడంతో 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. దీంతో ఐపీఎల్ సీజన్ 12 లో రాజస్థాన్ ఇంటి బాట పట్టనుంది.