ఢిల్లీని కరోనా వణికిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా సీఎం కేజ్రీవాల్ కూడా క్వారంటైన్లోకి వెళ్లారు. ఆయన భార్య సునీతకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దాంతో ఆమె ఐసోలేషన్లోకి వెళ్లారు. భార్య సునీతకు కరోనా సోకడంతో సీఎం కేజ్రీవాల్ కూడా క్వారంటైన్లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే అక్కడ ఆరు రోజుల లాక్డౌన్ విధించారు. అంతేకాకుండా ఈ నెల 26 వరకు కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. కేసుల తీవ్రత దృష్ట్ర్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.