లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన పోలీస్ ఆఫీసర్

లంచం తీసుకుంటూ  సీబీఐకి  రెడ్ హ్యాండెడ్ గా దొరికిన పోలీస్ ఆఫీసర్

ఢిల్లీలో రూ. 50 వేలు లంచం తీసుకుంటూ పట్టబడ్డ  ఓ హెడ్ కానిస్టేబుల్ ను  సోమవారం  సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలోని ఓ దుకాణదారుడి నుంచి రూ.50 వేలు  లంచం డిమాండ్ చేశాడు హెడ్ కానిస్టేబుల్  భీమ్ సింగ్. దీంతో షాపు యజమాని సీబీఐని సంప్రదించాడు. అపుడు సీబీఐ అధికారులు పక్కాగా ప్లాన్ వేసి అతడిని పట్టుకునేందుకు స్కెచ్ వేశారు. ప్లాన్ ప్రకారం షాపు యజమాని డబ్బులిస్తుండగా ఆ హెడ్ కానిస్టేబుల్ ను  సీబీఐ అధికారులు పట్టుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించగా  అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు. 

Aslo Read :- ఇంటి నుంచి వెళ్లిన బాలుడు మిస్సింగ్..

హెడ్ కానిస్టేబుల్  పారిపోయేందుకు ప్రయత్నించగా సీబీఐ అతడిని ఎలా పట్టుకున్నారో   మొత్తం ఆపరేషన్‌ సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.