ఢిల్లీ కోర్టులో పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ

ఢిల్లీ కోర్టులో పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ

ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఓ పోలీస్ వాహనం తగలబడగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్కింగ్ వివాదానికి సంబంధించిన వాదన సందర్భంగా ఒక పోలీసు అధికారి లాయర్ల పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయవాదులు…పోలీసు వాహనంపై నిప్పు పెట్టారు. ఆ తర్వాత నిరసన చేపట్టిన లాయర్లు ట్రాఫిక్‌ను కూడా అడ్డుకున్నారు. గాయపడిన వారిని ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ ఆస్పత్రికి తరలించారు.