న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవికి ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లాలూ బిడ్డలు హేమా యాదవ్, మీసా భారతి కూడా ఫిబ్రవరి 9న విచారణకు హాజరుకావాలని శనివారం ఢిల్లీ కోర్టు నోటీసులు ఇచ్చింది. ‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్’లో వీరందరికి సమన్లు వచ్చాయి.
అభ్యర్థుల నుంచి లాలూ కుటుంబం ల్యాండ్ తీసుకొని రైల్వే ఉద్యోగాలు ఇచ్చినట్లు ఈ కేసులో ప్రధాన అభియోగం. దీనిపై ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేసింది. ఈడీ దాఖలు చేసిన చార్జ్ర్జిషీట్ను ఢిల్లీ రోస్ ఎవెన్యూ కోర్టు అంగీకరించింది. ఈ కేసులో రబ్రీ దేవి, హేమ, మీసా, అమిత్ కత్యాలీ, హృదయానంద్ చౌదరి తదితరుల పేర్లతో ఈడీ తొలి చార్జిషీట్ ఫైల్ చేసింది.