ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రిథాల మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ కెమికల్ కంపెనీలో మంగళవారం (జూన్ 24) రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కంపెనీలో పని చేస్తోన్న ముగ్గురు కార్మికులు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. 

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 15 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.