మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో బుధవారం ఏకంగా 923 కేసులు నమోదయ్యాయి. మంగళవారంతో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య 86 శాతం పెరిగాయి. మే 30 తర్వాత దేశ రాజధానిలో ఇంత భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కారు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలు మూసివేయడంతో పాటు ఆంక్షలు మరింత కఠినం చేసింది. కర్నాటకలోనూ భారీగా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 566 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. 245 మంది కోలుకోగా.. ఆరుగురు మృతి చెందారు. బెంగాల్ లో బుధవారం 1089 కోవిడ్ కేసులు రికార్డయ్యాయి. 807 మంది కరోనా నుంచి కోలుకోగా.. 24గంటల వ్యవధిలో 12 మంది చనిపోయారు.