భారత రెజ్లర్, ఒలంపిక్ విజేత సుశీల్ కుమార్ ఆచూకీ గురించి సమాచారం అందిస్తే లక్ష రూపాయలను రివార్డుగా అందిస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. జూనియర్ రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో సుశీల్ కుమార్ కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు నమోదైన రోజు నుంచి సుశీల్ కుమార్ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ నెల 4న ఢిల్లీలోని చత్రసాల స్టేడియం పార్కింగ్ బయట సాగర్ రానాపై కొంత మంది దాడి చేయడంతో...తీవ్ర గాయాలతో ఆస్పత్రి ట్ర్రీట్మెంట్ తీసుకుంటూ జూనియర్ రెజ్లర్ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న మరో వ్యక్తి అజరు ఆచూకీ గురించి చెబితే రూ. 50 వేలను అందిస్తామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.
ఈ కేసులో గతంలో ఢిల్లీ కోర్టు సుశీల్తో పాటు పలువురు నిందితులకు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే.. సుశీల్ కుమార్ ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రోహిణి కోర్టులో మంగళవారం విచారణ జరిగే అవకాశముంది.