సుశీల్‌ కుమార్‌ ఆచూకీ చెప్తే రూ. లక్ష  రివార్డు

సుశీల్‌ కుమార్‌ ఆచూకీ చెప్తే రూ. లక్ష  రివార్డు

భారత రెజ్లర్‌, ఒలంపిక్‌ విజేత సుశీల్‌ కుమార్‌ ఆచూకీ గురించి సమాచారం అందిస్తే లక్ష రూపాయలను రివార్డుగా అందిస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. జూనియర్‌ రెజ్లర్‌ సాగర్‌ రానా హత్య కేసులో సుశీల్‌ కుమార్‌ కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు నమోదైన రోజు నుంచి సుశీల్ కుమార్ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ నెల 4న ఢిల్లీలోని చత్రసాల స్టేడియం పార్కింగ్‌ బయట సాగర్‌ రానాపై కొంత మంది దాడి చేయడంతో...తీవ్ర గాయాలతో ఆస్పత్రి ట్ర్రీట్మెంట్ తీసుకుంటూ జూనియర్‌ రెజ్లర్‌ చికిత్స పొందుతూ  చనిపోయాడు. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న మరో వ్యక్తి అజరు ఆచూకీ గురించి చెబితే రూ. 50 వేలను అందిస్తామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.

 ఈ కేసులో గతంలో ఢిల్లీ కోర్టు సుశీల్‌తో పాటు పలువురు నిందితులకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. అయితే.. సుశీల్‌ కుమార్‌ ముందస్తు బెయిల్‌ దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రోహిణి కోర్టులో మంగళవారం విచారణ జరిగే అవకాశముంది.