కర్ణాటకలో భారీ వర్షం పడింది. బెంగళూరులోని బాగేపల్లి, చిక్కబళ్లాపుర, దేవనహళ్లి, హెబ్బాళ, యలహంక, సదాశివనగర్, మల్లేశ్వరం, మెజెస్టిక్, కోరమంగల, కబ్బన్ రోడ్డు, శివాజీనగర ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచింది. వర్షంతో పలు చోట్ల వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హెబ్బాళ దగ్గర రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. బృహత్ బెంగళూరు మహానగర్ పాలిక అధికారులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రాబోయే మూడు రోజులపాటు బెంగళూరులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
#WATCH | Karnataka: Several parts of Bengaluru face waterlogging amidst heavy rainfall in the city.
— ANI (@ANI) April 14, 2022
An emergency operation in waterlogged areas is underway by BBMP (Bruhat Bengaluru Mahanagara Palike) & fire department.
Visuals from Banashankari, Kathreguppe, Jayaprakash Nagara pic.twitter.com/XOn81C9C8d
మరిన్ని వార్తల కోసం