ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలి : గార్లపాటి కృష్ణారెడ్డి

ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలి : గార్లపాటి కృష్ణారెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో డీఈవో భిక్షపతిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై డీఈవో స్పందిస్తూ అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఏదైనా పాఠశాల యాజమాన్యం వినకపోతే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వెంటనే ప్రొసీడింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, జిల్లా నాయకులు మహేంద్రరెడ్డి, టౌన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏరెడ్ల చంద్రశేఖర్ రెడ్డి, జర్నలిస్టులు ఉన్నారు.