ఢిల్లీ : భారత్, చైనా సరిహద్దులో సైనికుల ఘర్షణలపై రాజ్యసభలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. సరిహద్దులో సైనికుల ఘర్షణపై కేంద్ర ప్రభుత్వం నిజాలను దాచిపెడుతోందని ఆరోపించారు.
బోర్డర్ ఘర్షణలపై సభలో చర్చ జరపాలని ఖర్గే పట్టుబట్టారు. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటుంటే కేంద్రం ఏం చేస్తోందని ఖర్గే ప్రశ్నించారు. గొడవపై వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.