
దేవరకొండ, వెలుగు : నియోజకవర్గంలోని పెండింగ్ పనులకు నిధులు కేటాయించాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ మంత్రులను కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
నియోజకవర్గంలో పెండ్లిపాకల రిజర్వాయర్, రోడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని మంత్రులను ఆయన కోరారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట డిండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు ఉన్నారు.