అలంపూర్​ ఆలయాలకు పోటెత్తిన భక్తులు

అలంపూర్​ ఆలయాలకు పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్థానికులతో పాటు వివధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని గణపతి పూజ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు.

శివ స్వాములకు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అన్నదాన సత్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పురేందర్ కుమార్ తెలిపారు. 41 రోజుల పాటు అన్నదానం ఉంటుందని, శివ స్వాములు అన్నప్రసాదం స్వీకరించి స్వామి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.