శ్రావణ శుక్రవారం.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

శ్రావణ శుక్రవారం.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.  2023 ఆగస్టు 25 శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు.   శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా, సర్వదర్శనానికి 18గంటల సమయం పడుతోంది.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  తిరుమల తిరుపతి దేవస్థానం  (టీటీడీ) అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  

 ఇక గురువారం తిరుమల  శ్రీవారిని 67 వేల 308 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 26 వేల 674 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.