యాదాద్రికి పెరిగిన భక్తులు.. దర్శనానికి రెండు గంటలు

యాదాద్రికి పెరిగిన భక్తులు.. దర్శనానికి రెండు గంటలు

యాదాద్రి లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులకు తోడు ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని సన్నిధి కిటకిటలాడింది. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి యాదాద్రికి తరలివచ్చి లక్ష్మీనరసింహులను దర్శించుకుని తరిస్తున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో స్వామివారి  ధర్మదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఆలయ అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.