ఫించన్ల స్కామ్ పై దర్యాప్తు చేయాలని ధర్నా

ఫించన్ల స్కామ్ పై దర్యాప్తు చేయాలని ధర్నా

మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలంలో ఫించన్ల స్కామ్ పై దర్యాప్తు చేయాలని.. MPTC ముత్తె రాజన్నను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు…కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. MPTC  రాజన్నపై ఆరోపణలు రుజువై వారం రోజులైనా ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.  వికలాంగుల పెన్షన్లను తిన్న అక్రమార్కులపై జిల్లా కలెక్టర్ వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.