కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూ ధవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూరం

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూ ధవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూరం

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగు వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో ఎదురుదెబ్బ. భుజం గాయంతో కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్రవారం కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూ అందుబాటులో ఉండటం లేదు. ఈ నెల 9న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడిన ధవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ తర్వాత బరిలోకి దిగలేదు. సామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాండిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు. 

‘ధవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. స్లోగా రికవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నాడు. అతని బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నందుకు బాధగా ఉంది. నెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతి రోజు ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడు. కానీ పూర్తి ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడం లేదు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే చెన్నైతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండొచ్చు’ అని స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోషి వెల్లడించాడు. మరోవైపు వికెట్ తీసిన తర్వాత అతిగా సంబురాలు చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాసిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సలామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు మందలించారు.