ఐదో వన్డేకు ధోనీ సిద్ధం

ఐదో వన్డేకు ధోనీ సిద్ధం

తొడ కండరాల గాయంతో రెండు వన్డేలకు దూరమైన భారత కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐదో వన్డేకు అందుబాటులోకి వచ్చాడు. ధోని పూర్తి ఫిట్ నెస్ ను సాధించాడని… ఐదో వన్డే లో తప్పక ఆడతాడని టీమిండియా అసిస్టెంట్‌ బ్యాటింగ్‌ కోచ్ సంజయ్ బంగర్ శనివారం తెలిపారు. నెట్స్ లో ధోనీ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడని అతడి రాకతో మిడిల్ ఆర్డర్ బలోపేతం అవుతుందని బంగర్ చెప్పారు.

న్యూజిలాండ్ తో జరిగిన నాలుగవ వన్డేలో మిడిల్ ఆర్డర్ లోపంతో భారత్ ఓడింది. దీంతో ఐదవ వన్డేను విజయవంతంగా పూర్తిచేయాలని భారత్ భావిస్తుంది. వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం ఉదయం 7.30 ని.లకు (భారత కాలమానం ప్రకారం) భారత్-న్యూజిలాండ్ మధ్య చివరిదైన ఐదో వన్డే జరుగనుంది. ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకుంది ఇండియా.