- సోషల్ మీడియాలో హద్దులు దాటి పలువురి విమర్శలు
న్యూఢిల్లీ: ఐపీఎల్లో నిరాశ పరుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్పై సోషల్ మీడియాలో కొందరు హద్దులు దాటి విమర్శలు చేస్తున్నారు. విమర్శలు మహీకి అలవాటైపోయినా.. ఇప్పుడవి అతని ఐదేళ్ల కుమార్తె జివా వరకు చేరాయి. కోల్కతాతో మ్యాచ్ తర్వాత చెన్నై పై ముఖ్యంగా ధోనీ నిర్ణయాలపై ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. కేదార్ ఎంపికపై కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా..మరికొందరు ధోని సరిగా ఆడకుంటే తన కూతురు జివాను అత్యాచారం చేయడానికి కూడా వెనకాడబోమంటూ హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ నెగెటివిటీపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త కామెంట్లు పోస్ట్ చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.