అమిత్ షా విందు : హాజరుకానున్న శివసేన,  అకాళీదల్ నేతలు

అమిత్ షా విందు : హాజరుకానున్న శివసేన,  అకాళీదల్ నేతలు

ఎన్డీఏ  పక్షాలకు  బీజేపీ అధ్యక్షుడు  అమిత్ షా  విందు  ఏర్పాటు చేశారు.  ఈ విందుకు హాజరవ్వాలని  చివరి క్షణంలో  నిర్ణయించుకున్నారు  బిహార్ సీఎం  నితీష్ కుమార్. శివసేన,  అకాళీదల్ సహా …పలు పార్టీల ముఖ్య నేతలు  హాజరుకానున్నారు.  ప్రధాని మోడీ  కూడా  ఈ విందు భేటీకి  వచ్చే  అవకాశం ఉంది.  ఎగ్జిట్ పోల్స్  అన్నీ బీజేపీకి,  ఎన్డీఏకు  వన్ సైడ్ గా  పట్టం కట్టడంతో  రాజకీయ సమీకరణాలు  మారుతున్నాయి. తమతమ  రాష్ట్రాలకు  మేలు చేసే  వారికే ….మద్దతు ఇచ్చేందుకు  కొన్ని ప్రాంతీయ పార్టీలు  వ్యూహాలతో ఉన్నాయి.

ఒడిశా ప్రయోజనాల  కోసం  కేంద్రంలో ఎవరు వస్తే  వారికే  తమ మద్దతు  ఉంటుందని  ఇప్పటికే  బిజూ జనతా దళ్ ప్రకటించింది.  దీంతో  ఇదే బాటలో  మరికొన్ని ప్రాంతీయ పార్టీలు  ఉండే అవకాశం  ఉంది. కేంద్రంలోని  ప్రభుత్వంతో  సఖ్యతగా  ఉండి  రాష్ట్రాల ప్రయోజనాలను  కాపాడుకోవాలన్న  భావనతో …తటస్థ పార్టీలు  ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్  అంచనాకు  భిన్నంగా  పూర్తి  మెజార్టీ రాకపోతే …తటస్థ పార్టీలను ఎలా  ప్రసన్నం చేసుకోవాలన్న  విషయంపై  అమిత్ షా  వ్యూహాలు  రెడీ చేసుకున్నారు.  మరోవైపు  ప్రధాని మోడీ  కేంద్ర  మంత్రులతో  సాయంత్రం 4 గంటలకు  సమావేశమవనున్నారు.