రామ్ చరణ్ను కలిసిన రాజ్కుమార్ హిరానీ.. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా లోడింగ్?

రామ్ చరణ్ను కలిసిన రాజ్కుమార్ హిరానీ.. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా లోడింగ్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) ను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ(Rajkumar hirani) కలిశారు. వీరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయట. ప్రస్తుతం ఇందుకు సంబందించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే గనుక నిజమైతే..  ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా లోడింగ్ అని చెప్పొచ్చు. 

ఇంతేకీ అసలు విషయం ఏంటంటే.. రామ్ చరణ్ ఇటీవల ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రసిద్ధ సిద్దగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అనంతరం స్టార్ క్రికెటర్ ధోనితో కలిసి పెప్సీ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. గతంలో రామ్ చరణ్ అండ్ ధోని కలిసి పెప్సీ యాడ్ లో కనిపించారు. ఇప్పుడు మరోసారి పెప్సీ బ్రాండ్ కోసం ఒక యాడ్ షూట్ చేస్తున్నారు ఈ ఇద్దరు స్టార్స్. 

Also Read :- సెన్సార్‌ బోర్డు సంచలన నిర్ణయం.. ఇక నుండి ఆ పద్ధతి ఉండదు

ఈ  క్రమంలోనే రామ్ చరణ్ ను కలిసారుట బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. ఆయనకు ఒక కథ కూడా వినిపించారట. దానికి రామ్ చరణ్ కూడా ఓకే అన్నారని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ అటు బి టౌన్లో, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుమార్ హిరానీ ఇప్పటివరకు, మున్నాభాయ్ MBBS, లగేరహో మున్నాభాయ్,3 ఇడియట్స్,పీకే,సంజు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. ప్రస్తుతం ఈ దర్శకుడు షారుఖ్ ఖాన్ తో దుంకీ అనే సినిమా చేస్తున్నారు. అలాంటి దర్శకుడు రామ్ చరణ్ ను కలిసి ఒక కథ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఈప్రాజక్టు గనుక ఒకే అయితే.. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా లోడింగ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.