డీకే ఫ్యామిలీ ప్రతిష్టను దిగజార్చిన్రు : డీకే స్నిగ్ధా రెడ్డి

డీకే ఫ్యామిలీ ప్రతిష్టను దిగజార్చిన్రు : డీకే స్నిగ్ధా రెడ్డి
  • బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై డీకే అరుణ కూతురు స్నిగ్ధా రెడ్డి ఫైర్​ 

గద్వాల, వెలుగు : గత ఎన్నికల్లో అబద్ధపు మాటలు చెప్పి,  మొసలి కన్నీరు కార్చి డీకే ఫ్యామిలీ ప్రతిష్టను బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,  ఆయన భార్య బండ్ల జ్యోతి దిగజార్చారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూతురు,  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధా రెడ్డి మండిపడ్డారు. శనివారం బంగ్లాలో ఆమె మాట్లాడుతూ..  ‘‘మా నానమ్మ అరేయ్ పాముకు పాలు పోసి పెంచుతున్నారు..”అని చెప్పిన వినకుండా మా అమ్మానాన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కొడుకులాగా పెంచితే.. అబద్ధాలు చెప్పి బంగ్లానే కాటేసి విషమిచ్చారన్నారు.  

చట్ట ప్రకారం న్యాయ పోరాటం చేస్తే కోర్టులకు జవాబు చెప్పకుండా కోర్టులపైనే మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.  తాను గర్భిణిగా ఉన్నప్పుడు తనను జైలుకు వెళ్లేలా ప్లాన్ చేసింది ఎవరో నీ భర్తను అడగాలని జ్యోతికి సూచించారు.  ‘‘గతంలో మీరు ఎట్లా ఉన్నారు..  ఇప్పుడు ఎట్లా ఉన్నారు.. ఆస్తులు ఎట్లా వచ్చాయో గద్వాల ప్రజలందరికీ తెలుసు..”అన్నారు.  ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో చర్చకు రెడీ అన్నారు. ప్రెస్ మీట్ లో గడ్డం కృష్ణారెడ్డి, కృష్ణవేణి, సంజీవ్ భరద్వాజ్ తదితరులు ఉన్నారు.