ప్రధాని మోదీని తిట్టిన డీఎంకే మంత్రిపై కేసు

ప్రధాని మోదీని తిట్టిన డీఎంకే మంత్రిపై కేసు
  • ప్రధాని మోదీని తిట్టిన డీఎంకే మంత్రిపై కేసు

చెన్నై :  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని దూషించిన డీఎంకే మంత్రి అనితా రాధాకృష్ణన్ పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 22న ట్యూటికోరిన్  జిల్లాలోని తండపట్టులో నిర్వహించిన డీఎంకే కార్యకర్తల సమావేశంలో రాధాకృష్ణన్  మాట్లాడుతూ..  మోదీపై అతి దారుణంగా దుర్భాషలాడారు. దీంతో బీజేపీ తూత్తుకుడి సౌత్  జిల్లా అధ్యక్షుడు ఆర్.సిధ్ రంగతన్  ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఒక బహిరంగ సభలో, అదికూడా ఒక మహిళా ఎంపీ (కనిమొళి) సమక్షంలో ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాధాకృష్ణన్  అసభ్యకరమైన భాషలో మాట్లాడారని సిధ్ రంగతన్  తన ఫిర్యాదులో పేర్కొన్నారు.