న్యూఢిల్లీ: చెక్ఇన్ కౌంటర్ల వద్ద బోర్డింగ్ పాసుల జారీ చేసే టైంలో ప్యాసింజర్ల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయవద్దని ఎయిర్లైన్స్ సంస్థలకు ఏవియేషన్ మినిస్ట్రీ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇండిగో, స్పైస్ జెట్తో పాటు గో ఫస్ట్ ఎయిర్లైన్స్ సంస్థలు బోర్డింగ్ పాస్లు కావాలనుకునే ప్యాసింజర్స్ నుంచి అదనంగా రూ.200 వసూలు చేస్తున్నాయని తెలిపింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇది ఎయిర్క్రాఫ్ట్ రూల్స్కు విరుద్ధమని ఏవియేషన్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. బోర్డింగ్పాస్ విషయంలో ఎయిర్లైన్స్ సంస్థలు ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేయవద్దని 1937, ఎయిర్క్రాఫ్ట్ రూల్స్ప్రొవిజన్స్ తెలియజేస్తోందని గుర్తు చేసింది. ఇక నుంచి ఎయిర్పోర్టు చెక్ ఇన్ కౌంటర్స్ వద్ద ఏ సంస్థ కూడా బోర్డింగ్ పాసుల కోసం అదనంగా డబ్బులు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులందరూ వెబ్చెక్ ఇన్ చేసుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించింది. గతంలో కూడా దీనిపై స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చామని గుర్తు చేసింది. బోర్డింగ్ పాసులకు ఎక్స్ట్రా ఫీజు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పింది.