కొత్త ఇంటి నంబర్ల జారీలో లేట్ చేయొద్దు

కొత్త ఇంటి నంబర్ల జారీలో లేట్ చేయొద్దు
  •     వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల ​

వికారాబాద్, వెలుగు : కొత్తగా నిర్మించే ఇండ్లకు ఇంటి నంబర్లు ప్రభుత్వ రూల్ మేరకు  ఇవ్వాల్సిందేనని, ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేశ్​హెచ్చరించారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో రెవెన్యూ అధికారులతో  చైర్ పర్సన్ సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.

కొత్త ఇంటి నంబర్ల కేటాయింపుపై రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు  పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ఇలాంటివి మళ్లీ జరగొద్దని హెచ్చరించారు.  మున్సిపల్ కు మరింత ఆదాయం వచ్చేలా రెవెన్యూ సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కమిషనర్ జాకీర్ అహ్మద్, ఆర్వో కృపాకర్, బిల్ కలెక్టర్లు ఉన్నారు.