లక్ష్య సాధనలో యువత ధైర్యాన్ని కోల్పోవద్దు

లక్ష్య సాధనలో యువత ధైర్యాన్ని కోల్పోవద్దు
  •    బిజినెస్ కమ్యూనికేషన్ ఎక్స్​పర్ట్ డాక్టర్ మాథ్యూ మోనిపల్లి
  •     ధృవ కాలేజీలో స్టూడెంట్లకు వర్క్ షాప్

మేడ్చల్, వెలుగు: లక్ష్య సాధనలో యువత ధైర్యాన్ని కోల్పోవద్దని బిజినెస్ కమ్యూనికేషన్ ఎక్స్ పర్ట్ డాక్టర్ మాథ్యూ మోనిపల్లి తెలిపారు. ‘ఎలా సంకెళ్లు వేసుకుంటాం.. ఎలా విడిపోతాం’ అనే అంశంపై మేడ్చల్​లోని ధృవ కాలేజీలో స్టూడెంట్లకు నిర్వహించిన వర్క్​షాప్​కు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టూడెంట్లను ఉద్దేశించి మాథ్యూ మాట్లాడుతూ.. మరోసారి ధృవ కాలేజీకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. యువత అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసేలా ఉండాలన్నారు. 

ఎలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దని.. మనల్ని మనం తక్కువ చేసుకోవద్దని సూచించారు. అనంతరం సింహం, ఎలుకకు సంబంధించిన కార్టూన్​ను స్టూడెంట్లకు చూపించి అందులోని విషయాన్ని వారికి వివరించారు. కార్యక్రమంలో ధృవ కాలేజ్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి, హెచ్ఆర్ హెడ్ ప్రొఫెసర్ ప్రియా నాయుడు, డాక్టర్ అఖిల్ రెడ్డి, ఎండీ అండర్సన్, ఫ్యాకల్టీ, స్టూడెంట్లు పాల్గొన్నారు  యువత 
తదితరులు పాల్గొన్నారు.