పద్మారావునగర్, వెలుగు: వరల్డ్ జునోసిస్ డే సందర్భంగా పెట్ డాగ్స్, క్యాట్లకు ఫ్రీగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్లను వేస్తున్నట్టు వెటర్నరీ డాక్టర్లు తెలిపారు. గురువారం బోయిగూడ ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రిలో పలు పెట్ డాగ్స్, క్యాట్లకు ఉచితంగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్లను వేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ వెటర్నరీ వర్సిటీకి అనుబంధమైన బోయిగూడ వెటర్నరీ హాస్పిటల్ కు 220 పెట్ డాగ్స్, 30 క్యాట్లను తీసుకురాగా వ్యాక్సిన్లను వేసినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ, ఇండియన్ఇమ్యునాలజికల్ఫార్మసీల సహకారంతో వ్యాక్సినేషన్ చేసినట్లు చెప్పారు. ప్రోగ్రాంలో వెటర్నరీ డాక్టర్లు ఎస్.అయోధ్య, జె.రాధాకృష్ణరావు సిబ్బంది పాల్గొన్నారు.