ఖిలా వరంగల్ (మామునూరు)/ జనగామ అర్బన్, వెలుగు : యోగాతో ఆరోగ్యంగా ఉండవచ్చని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఖిలా వరంగల్, జనగామ ధర్మకంచ మినీ స్టేడియంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం, ఆయూష్దినోత్సవాలను నిర్వహించారు. వరంగల్లో పాల్గొన్న కలెక్టర్ అడిషనల్కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్వో సాంబశివరావుతో కలిసి యోగాసనాలు వేశారు. జనగామలో డీఎంహెచ్వో మల్లికార్జునరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం, ఆఫీసర్లు పాల్గొని యోగా చేశారు.
