తొగుట(రాయపోల్), వెలుగు: రాయపోల్ మండలం రామారం గ్రామంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ టీమ్ శ్రీసాయి మహదేవ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించి 1,100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తించామని సిద్దిపేట జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ తెలిపారు. బియ్యం స్వాధీనం చేసుకొని తొగుట, మిరుదొడ్డి ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించారు.
ఈ ఘటనపై రాయపోల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సంబంధిత మిల్లర్ పై గతంలోనూ పీడీఎస్ బియ్యం మళ్లింపు కేసులు, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తనిఖీల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ పండరి, డీటీ రాజిరెడ్డి, రాయపోల్ ఎస్సై కుంచం మానస పాల్గొన్నారు.
