సర్కారు ఖర్చుతో ప్రియాన్స్కు ట్రీట్మెంట్.. కుక్క దాడిలో కన్ను కోల్పోయింది..

సర్కారు ఖర్చుతో ప్రియాన్స్కు ట్రీట్మెంట్.. కుక్క దాడిలో కన్ను కోల్పోయింది..



యాదాద్రి, వెలుగు :  కుక్క దాడిలో కన్ను కోల్పోయిన ప్రియాన్స్​కు ప్రభుత్వమే ట్రీట్​మెంట్​ చేయిస్తోందని యాదాద్రి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి తెలిపారు. కోలుకునే వరకూ పూర్తి స్థాయిలో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.  ఎల్వీ ప్రసాద్​ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ పొందుతున్న ప్రియాన్స్​ను ఆయన పరామర్శించారు. 

హెల్త్​ కండీషన్​ను అడిగి తెలుసుకున్నారు. కుడి కన్ను పూర్తిగా బయటకు వచ్చినందున ప్రియాన్స్​కు చూపు వచ్చే అవకాశం లేదని, కృత్రిమ కన్ను అమరుస్తామని డాక్టర్లు చెప్పారని ఎమ్మెల్యే కుంభం తెలిపారు. ప్రియాన్స్​ తలిదండ్రులకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. కాగా ప్రియాన్స్​ హెల్త్​ కండీషన్​ను ఢిల్లీలో ఉన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.