మాంసం కోసం వీధికుక్కల రవాణా

మాంసం కోసం వీధికుక్కల రవాణా

త్రిపుర: వీధికుక్కలను రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు త్రిపుర పోలీసులు. వ్యానులో 12కుక్కలతో రవాణా అవుతున్న ఇద్దరిని త్రిపుర – మిజోరాం బార్డర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆ ఇద్దరిని ఇంటరాగేట్ చేశారు పోలీసులు. దీంతో మిజోరాంలో కుక్కల మాంసానికి డిమాండ్ బాగా ఉందని నిందితులు చెప్పారు. ఒక్క కుక్కకు 2వేల నుంచి రెండు వేల ఐదు వందల ధర పలుకుతుందని వారు చెప్పారు. ఇందుకు తాము కుక్కలను మిజోరాంకు తరలిస్తున్నట్లుగా చెప్పారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు పోలీసులు.