భారత్ – పాక్ సమస్య ఓ కొలిక్కి వస్తోంది: ట్రంప్

భారత్ – పాక్ సమస్య ఓ కొలిక్కి వస్తోంది: ట్రంప్

హనోయ్: దశాబ్దాలు పరిష్కారం కాకుండా భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతున్న సమస్య ఓ కొలిక్కి వస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కొద్ది రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టాయన్నారు. వియత్నాంలోని హనోయ్ లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో సమావేశం తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారత్, పాకిస్థాన్ ల నుంచి ఓ మంచి వార్త వింటామని చెప్పారు. తాము ఇరు దేశాలతో చర్చలు జరుపుతున్నామని, ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. సమస్య పరిష్కారం దిశగా ప్రత్నిస్తున్నామని తెలిపారు. దశాబ్దాలుగా అగ్ని రాజేస్తున్న సమస్య ఓ కొలిక్కి వస్తోందని చెప్పారు.