
కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దన్నారు మంత్రి హరీశ్ రావు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే నిరుపేద దివ్యాంగులు, వితంతువులకు ఆర్ధిక సహాయం అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందన్నారు. ఆసరా పథకం ద్వారా లబ్ధిదారులకు ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మెదక్ జిల్లా తూప్రాన్లలో నిర్వహించిన రోడ్ షోలలో పాల్గొని మాట్లాడారు హరీశ్రావు. ఎన్నికల్లో TRS తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిని తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని తేల్చిచెప్పారు. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు మంత్రి హరీశ్. గజ్వేల్, తూప్రాన్లోని అన్ని వార్డులో TRSను గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని కోరారు.