హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటికీ డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్ పొందని స్టూడెంట్లకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మరో అవకాశమిచ్చింది. ఈ నెల 25 నుంచి దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్-ను నిర్వహిస్తున్నట్లు కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు.
ఈ నెల 25 నుంచి 28 వరకు రూ.400 ఫీజుతో రిజిస్ర్టేషన్ చేసుకోవాలని..ఈ నెల 26 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. 28న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించి..29న సీట్లు అలాట్ చేస్తామని స్పష్టం చేశారు. సీట్లు పొందిన విద్యార్థులు 31లోగా ఆల్ లైన్ సెల్ఫ్రిపోర్టింగ్-తో పాటు కాలేజీల్లోనూ రిపోర్టు చేయాలని లింబాద్రి సూచించారు.