వైజాగ్-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు

వైజాగ్-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు

వైజాగ్-విజయవాడ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే. ప్రయాణీకుల సౌకర్యార్థం వైజాగ్-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు పరుగులు తీయనుంది. ఈ నెల 26న వైజాగ్-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు ఉదయ్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం కానుంది. రైల్వేశాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. వైజాగ్ నుంచి ప్రతిరోజు ఉదయం 5.45 గంటలకు బయలుదేరి.. ఉ.11.15 గంటలకు విజయవాడ చేరుతుంది. విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి.. రాత్రి 11 గంటలకు వైజాగ్ కు ఈ రైలు చేరుతుందని అధికారులు తెలిపారు.