న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా ఇన్చార్జ్గా ఏపీకి చెందిన పార్థసారథి నియమితు లయ్యారు. ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సెక్రటరీగా ఉన్న ఆయనకు పార్టీ తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక బాధ్యతలను అప్పగించింది. కో ఇన్చార్జ్గా రాధే శ్యామ్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ మేరకు శుక్రవా రం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్.. దేశ వ్యాప్తంగా 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతా లకు ఇన్ చార్జ్, కో ఇన్చార్జ్లను నియమించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పార్థ సారథి తెలిపారు.